ePaper
Monday, June 15, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్180 ఏళ్ల పబ్లిక్ గార్డెన్స్‌కు ఎసరు పెట్టిన రేవంత్ ప్రభుత్వం

180 ఏళ్ల పబ్లిక్ గార్డెన్స్‌కు ఎసరు పెట్టిన రేవంత్ ప్రభుత్వం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక 9టీవీ తెలుగు న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి జూన్ 13 2026: సుమారు 54 ఎకరాల్లో నిజాంల కాలంలో నిర్మించిన భాగ్-ఏ-ఆమ్, తదనంతర కాలంలో పబ్లిక్ గార్డెన్స్‌గా పేరొందింది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కళ్లు ఈ పేదవాడి గార్డెన్స్ మీద పడింది. తెలుగు యూనివర్సిటీ దగ్గరి నుండి లక్డీ-కా-పూల్ జంక్షన్ వరకూ కనెక్ట్ చేసే ఫ్లైఓవర్ ఈ పబ్లిక్ గార్డెన్ మీదుగా కట్టాలని అధికారులు డిజైన్ రూపొందించారని, దానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం మొదలుపెట్టింది. ఈ ఫ్లైఓవర్ కడితే నగరం నడిబొడ్డున ఉన్న అతికొద్ది పచ్చని పార్కుల్లో ఒకటైన పబ్లిక్ గార్డెన్స్ నామ రూపాల్లేకుండా పోయే ప్రమాదం ఉంది. గత ఏడాది కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవిని నరికేసి సుప్రీం కోర్టు చివాట్లు తిన్నది రేవంత్ ప్రభుత్వం. మొన్నటికి మొన్న కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం వందలాది చెట్లు నరికేస్తే మరోసారి సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఈ హరితహననం ఆపేసింది. పచ్చదనం తక్కువై, నగరంలో ఉష్ణోగ్రతలు ఎక్కువవుతున్నాయి. కుంభవృష్టి లాంటి వర్షాలు ఎక్కువయ్యాయి. అయినా తీరుమార్చుకోని రేవంత్ ప్రభుత్వం, నగరంలో ఉన్న అతి పురాతన పబ్లిక్ గార్డెన్స్ మీద గొడ్డలి వేటు వేయనున్నది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!