ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

మినుముకుంట కట్ట ధ్వంసం ఘటనపై చర్యలు తీసుకోవాలి బీఆర్ఎస్ నాయకుల డిమాండ్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 04 మే 2026: వనపర్తి మండలం కాశీంనగర్ గ్రామానికి చెందిన మినుముకుంట కట్టను ధ్వంసం చేసిన ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ధ్వంసమైన ప్రదేశాన్ని సందర్శించి, బాధిత రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు ఇరిగేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, కట్టను పునర్నిర్మించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నాయకుడు తన పొలంలో ఉందని చెప్పి ఈ కట్టను ధ్వంసం చేసినట్లు వారు ఆరోపించారు. కట్టను పునరుద్ధరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రైతు రాము మాట్లాడుతూ ఈ కుంటకు గత 20 సంవత్సరాలుగా పథకాల కింద అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. కట్టకు తూము, అలుగు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కట్ట తొలగింపుతో పొలాలకు వెళ్లే మార్గం దెబ్బతినడంతో పాటు భూగర్భ జలాలపై ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అధికారులను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. మరో రైతు మాట్లాడుతూ… ఈ కట్టపై నుంచి తరతరాలుగా రైతులు తమ పొలాలకు వెళ్లేవారని, కట్ట తొలగింపుతో వందల ఎకరాల రైతులకు నష్టం జరుగుతుందని తెలిపారు. కట్ట మట్టితో సమీపంలోని బావిని పూడ్చడంతో గ్రామ దేవతకు వెళ్లే మార్గం కూడా మూసుకుపోయిందని అన్నారు. వర్షాకాలంలో వరదల వల్ల పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మండల పార్టీ అధ్యక్షుడు కే మాణిక్యం, నాయకులు రఘువర్ధన్ రెడ్డి, డేగ మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాము, ఉల్లెందుల రాములు, ఎర్రన్న, తిరుపతయ్య, గుండెమోని మధు, బాలరాజు, హనుమంతు, ఆనంద్, నక్కమోని చిన్న రాము, మహేష్, నరేష్, రేవల్లి వెంకటయ్య, బుడ్డమ్మ, శివకుమార్, కురుమూర్తి, పెద్దగూడెం రాములు తదితరులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Latest Articles

NSS వారి ఆధ్వర్యంలో జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మొక్కలు నాటిన మునిసిపల్ చైర్మన్ శ్రీ వెలుగు ప్రశాంత్ కుమార్

   //పొలిటికల్ పవర్ పత్రిక.ప్రతినిధి.ఎల్లస్వామి జమ్మికుంట //జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

బార్బర్స్ డే సందర్బంగా జండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ

జూలూరుపాడు సెప్టెంబర్ 16: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర...

సెప్టెంబర్ 28న చలో కడప కార్యక్రమాన్ని విజయవంతం చేయండి సిపిఐ

 *సెప్టెంబర్ 27–30 సిపిఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలి.సిపిఐ మండల...

కొత్తకోట లోఘనంగామాజీఎమ్మెల్యేఅయ్యప్ప వర్ధంతి వేడుకలు

– మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప విగ్రహానికి భారీగ పూలమాల సమర్పించి పుష్పాంజలి ఘటించి...

Related Articles

కొత్తకోట లోఘనంగామాజీఎమ్మెల్యేఅయ్యప్ప వర్ధంతి వేడుకలు

– మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప విగ్రహానికి భారీగ పూలమాల సమర్పించి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించిన వివిధ పార్టీల నేతలుపొలిటికల్.పవర్ సమగ్రజాతీయతెలుగుదినపత్రిక పిఎన్.9టీవీన్యూస్వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్. సెప్టెంబర్ 17.2026. వనపర్తి జిల్లాకొత్తకోట మండల కేంద్రంలోని చౌరస్తాలో గల కీర్తిశేషులు మాజీ...

విద్యార్థులు మంచి చదువులు చదువుకోండి మీకు అండగా నేను ఉంటా మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల 

– అమ్మ, సోదరుడు జ్ఞాపకార్థం విద్యార్థులకు బూట్లు, పెన్ను, పెన్సిల్స్, స్వీట్లు పంపిణి చేసిన మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డిపోలిటికల్ పవర్  సమగ్ర జాతీయ తెలుగుదినపత్రిక ...

అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయండి

– దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్,–  కొత్తకోట ఎస్సై. విక్రమ్, భాస్కర్ నాయుడు చేతుల మీదుగా వాల్ పోస్టర్ విడుదల,పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.12.2026.వచ్చే...
error: Content is protected !!