జనగణన సర్వేకు సర్వేకు సహకరించండి తాసిల్దార్ దిలీప్ కుమార్.

మే 10
పొలిటికల్ పవర్ PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
లక్షట్ పేట మండలంలోని 18 గ్రామాల్లో సోమవారం నుంచి ప్రారంభం కానున్న జనగణన సర్వేకు ప్రజలందరూ సహకరించాలని తాసిల్దార్ దిలీప్ కోరారు. ఆయన మాట్లాడుతూ సర్వే కోసం నలుగురు సూపర్వైజర్లు, 52 మంది ఎనిమరేటర్లను నియమించినట్లు తెలిపారు. సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని, సరైన సమాచారం అందించి సర్వేను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
