ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

సెల్‌ఫోన్ మాయలో రూ.5.50 లక్షలు మాయం..! క్షణిక అజాగ్రత్తతో భారీ చోరీ

పొలిటికల్ పవర్ పిన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

అహ్మదాబాద్, మే 31 : గుజరాత్‌లో పట్టపగలే జరిగిన ఓ చోరీ ఘటన సంచలనం రేపింది. సెల్‌ఫోన్‌లో మునిగిపోయిన వ్యక్తి అజాగ్రత్తను ఆసరాగా చేసుకున్న దొంగ కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలో రూ.5.50 లక్షల నగదుతో పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది.

 

అహ్మదాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతమైన మానెక్ చౌక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ బులియన్ మార్కెట్ వ్యాపారి ఉద్యోగి నగదు ఉన్న బ్యాగ్‌తో నడుచుకుంటూ వెళ్తూ సెల్‌ఫోన్ చూస్తూ పరధ్యానంలో ఉన్నాడు. ఈ క్రమంలో అతని వెనుక నుంచి నిశితంగా గమనిస్తూ వచ్చిన ఓ దొంగ, ఉద్యోగి అజాగ్రత్తను ఆసరాగా చేసుకుని చాకచక్యంగా బ్యాగ్‌ను తెరిచి అందులో ఉన్న రూ.5.50 లక్షల నగదును అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు.

 

కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ చోరీ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. సినిమా సన్నివేశాన్ని తలపించేలా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

*పోలీసుల హెచ్చరిక:* రద్దీ ప్రాంతాల్లో నడుస్తూ సెల్‌ఫోన్‌లో పూర్తిగా మునిగిపోవడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నగదు, విలువైన వస్తువులు లేదా బ్యాగ్‌లతో ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. క్షణిక అజాగ్రత్త భారీ నష్టాలకు దారితీయొచ్చని, ఫోన్ చూస్తూ నడిచేటప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులపై కూడా దృష్టి పెట్టాలని ప్రజలకు సూచించారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!