మంచిర్యాల కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.

జూన్ 1
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి మరియ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గార్ల ఆదేశానుసారం మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ గారిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అక్రమ అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద మంచిర్యాల కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా కార్యక్రమం నిర్వహించి,బేషరతుగా బాల్క సుమన్ గారిని విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు, యువజన నాయకులు,TBGKS నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
