సంస్థ వ్యవస్థాపకులు, చైర్మన్ ఆదేశాల మేరకు నియామకం
సామాజిక కార్యక్రమాల్లో విజయవంతంగా సేవలందించాలని శుభాకాంక్షలు
పొలిటికల్ పవర్ దినపత్రిక పిఎన్9 టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని మన సంస్థ వ్యవస్థాపకులు, చైర్మన్ బి. వీరన్న, పి. రామారావు, ఎం. వీరస్వామి, జి. సందీప్ కుమార్ ఆదేశాల మేరకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఇశ్రార్ అహమద్ను సత్తుపల్లి టౌన్ ప్రెసిడెంట్గా నియమించారు. ఇప్పటి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించి, సంస్థ బలోపేతానికి, హక్కుల పరిరక్షణకు తన అత్యుత్తమ సేవలను అందిస్తారని నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. మన సంస్థ కుటుంబంలోకి అడుగుపెట్టిన గౌరవనీయ సత్తుపల్లి టౌన్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇశ్రార్ అహమద్కు హృదయపూర్వక స్వాగతం, అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఆయన చేపట్టబోయే అన్ని సామాజిక కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు.

