ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంవిషాదంలో ఉన్న కుటుంబానికి అండగా కంబాల

విషాదంలో ఉన్న కుటుంబానికి అండగా కంబాల

📰 Generate e-Paper Clip

తక్షణ సాయంగా రూ.5 వేల నగదు, 25 కిలోల బియ్యం అందజేత..

ఎన్ వి ఆర్ టీవీ, తెలుగు పొలిటికల్ పవర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్ జులై 30 2026: తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం, గోకవరం మండలం, తంటికొండ గ్రామానికి చెందిన రాయి చిన్నారావు , భార్య రాయి నాగమణి ఇటీవలే మృతి చెందారు. ఈ విషయాన్ని విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు తక్షణ సహాయంగా రూ.5,000 నగదు, 25 కిలోల బియ్యం అందించాలని నిర్ణయించారు. ఆ సహాయాన్ని మృతురాలి కుమారులు రాయి నాగబాబు, రాయి వీరబాబు లకు అందజేయాలని రామసేన సభ్యులు, బీజేపీ నాయకులకు సూచించారు. ఆయన ఆదేశాల మేరకు తుమ్మల బుజ్జి, పాపోలు గనిరాజు, పదిలం చక్రరావు, మంగరాతి పద్దరాజు, నెల్లి శ్రీను బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. రూ.5,000 నగదు మరియు 25 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, అవసరమైన ప్రతి సహాయం అందిస్తానని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. కంబాల శ్రీనివాసరావు మానవతా దృక్పథాన్ని కుటుంబ సభ్యులు అభినందిస్తూ, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!