పెద్దమందడి తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీవో పరిణత
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 31 2026: పెద్దమందడి మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిం చుకునేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్దమం దడి తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీవో పరిణత సూచించారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసు కువచ్చేందుకు ప్రజావాణి మంచి వేదిక అని తెలిపారు.మండలంలోని పలు గ్రా మాల్లో వివిధ సమస్యలు నెలకొన్నాయని, ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదులు అంద జేయాలని వారు కోరారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధితశాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీ సుకుంటామని పేర్కొన్నారు.ప్రజలు కా ర్యాలయాల చుట్టూ తిరగకుండా తమ సమస్యలను ప్రజావాణి కార్యక్రమంలో నేరుగా అధికారులకు తెలియజేసి పరి ష్కారం పొందాలని సూచించారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని తహసీల్దార్ మల్లి కార్జున్, ఎంపీడీవో పరిణత కోరారు.

