అడ్వకేట్ భవాని కృష్ణ యాదవ్పై నమోదు చేసిన అక్రమ కేసులను ఖండించిన “ఐలు” పేద రైతులకు పూర్తి న్యాయ సహాయం అందిస్తామని హామీ దమ్మపేట, జూలై 10: అడ్వకేట్ గోళ్ల భవాని కృష్ణ యాదవ్ గారిపై దమ్మపేట పోలీసులచే నమోదు చేసిన అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర ప్రతినిధులు ఈరోజు ఖమ్మం, హైదరాబాద్ నుండి దమ్మపేటకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఐలు నాయకులు మాట్లాడుతూ, పేద రైతుల భూ హక్కుల పరిరక్షణ కోసం అడ్వకేట్ భవాని కృష్ణ యాదవ్ చేస్తున్న న్యాయ పోరాటానికి తమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రైతులకు న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తామని, భూ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తామని తెలిపారు. అలాగే, రైతులు భవిష్యత్తులో పెద్ద ఎత్తున చేపట్టే ప్రజాస్వామ్యబద్ధమైన నిరసన కార్యక్రమాలకు ఐలు పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. అవసరమైతే ఈ అంశాన్ని తెలంగాణ హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లేందుకు కూడా తమ సంఘం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు దొడ్డా లక్ష్మీనారాయణ , మోరంపూడి శ్రీనివాసరావు , కొలికపోగు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఐలు రాష్ట్ర నాయకులు కొల్లి సత్యనారాయణ, ఏడునూతల శ్రీనివాసరావు, జలసూత్రం శివరాం ప్రసాద్, జక్కంపూడి నాగేశ్వరరావు, ఉడతనేని శ్రీనివాసరావు, మారం సతీష్ , దర్గా వాలి, అరుణ తదితరులతో పాటు దమ్మపేట బార్ అసోసియేషన్ సభ్యులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
RELATED ARTICLES
