పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి జూలై 10:
తూర్పుగోదావరిజిల్లా అనపర్తిలోని నారాయణ విద్యాసంస్థలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా వృక్షారోపణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏజీఎం అలీషా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని సూచించారు. మొక్కలు మనకు ప్రాణవాయువును అందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణ విద్యాసంస్థ విద్యార్థులు అనపర్తిలోని దేవి చౌక్ పరిసర ప్రాంతాల్లోని దుకాణదారులకు మొక్కలను అందజేసి, వాటిని నాటి సంరక్షించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నందకుమార్, ఏజీఎం అలీషా, కో-ఆర్డినేటర్ మాధురి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మొక్కల సంరక్షణపై ప్రతిజ్ఞ చేసి, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని తెలిపారు.
