పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 08.2026.వనపర్తి జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్.రివిజన్.2026లొభాగంగా 88727నోటీసులకుగాను61116 మందిఓటర్లకునోటీసులుఅందజేయడం పూర్తి అయ్యాయని జిల్లాకలెక్టర్ ఆదర్శ్ సురభితెలిపారు.సోమవారం ఎస్.ఐ.ఆర్.ప్రక్రియలోభాగంగాఅనామలీస్, అన్ మ్యాపింగ్ జాబితాలొ నోటీసులు జనరేట్ అయిన వారికి నోటీసులు అందజేత, హియరింగ్ నిర్వహణ, ఆమోదించినదరఖాస్తుల పై రాష్ట్ర ప్రధాన ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి కలెక్టర్లతో విడియో కాన్ఫరెన్స్,ద్వారాసమీక్షనిర్వహించారు.అనామలీస్, అన్ మ్యాపింగ్ జాబితాలోనోటీసులునమోదుఅయినవాటినిసంబంధితఓటర్లకుఅందజేసే ప్రక్రియ వేగవంతం చేయాలని సి. ఈ.ఒఆదేశించారు.నోటీసులుఅందుకున్న వారికి హియరింగ్ జరిపి వారు ఇచ్చిన డాక్యుమెంట్లను బి. ఎల్ ఒ ల ద్వారా అప్లోడ్ చేసిన అనంతరం డాటా ఎంట్రీ చేయించే ప్రక్రియ సైతం వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లొ పాల్గొన్న జిల్లా కలెక్టర్ వివరిస్తూ వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు 61,116 వేల నోటీసులుసంబంధితఓటర్లకుఅందజేయడం జరిగిందని, అదేవిధంగా 4757 హియరింగ్ నిర్వహించినట్లు తెలిపారు.ఎన్నికలఅథారిటిసూచించిన నిబంధనల ప్రకారం హియరింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలియజేసారు.అదనపు కలెక్టర్ రెవెన్యూ టి వినోద్ కుమార్, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, వనపర్తి తహసీల్దార్ రమేష్ రెడ్డి తదితరులు వి. సి.లొ పాల్గొన్నారు.