ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిజూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద.. 10 గేట్లు ఎత్తివేత

జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద.. 10 గేట్లు ఎత్తివేత

📰 Generate e-Paper Clip

– జూరాలకు వరద తీవ్రత పెరిగిన నేపథ్యంలో గురువారం  అధికారులు పది గేట్లు ఎత్తివేశారు.
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 31.2026.

జూరాలకు వరద తీవ్రత పెరిగిన నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో అధికారులు పది గేట్లు ఎత్తివేశారు. గత వారం రోజులుగా కర్ణాటక రాష్ట్రంలోనిఆల్మట్టినుంచినీటినిఉండేలాచేస్తుండడంతోనారాయణపురం మీదుగా 30 వేలక్యూసెక్కులజలాలుజూరాలకుచేరుతూవచ్చాయి.కర్ణాటక,మహారాష్ట్రప్రాంతాలలోపుష్కలంగావర్షాలుకురుస్తుండడంతోబుధవారం1,35,620క్యూసెక్కులనుదిగువకువిడుదలచేయడం,బీమానుంచి60వేలక్యూసెక్కుల జలాలు వస్తూ ఉండడంతోదాదాపుగా రెండు లక్షల క్యూసెక్కుల నీరు మక్తల్ నియోజకవర్గం తంగడి వద్ద ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణా నదికి వచ్చి చేరుతున్నాయి. దీనితోపాటు జూరాల ఎగువ భాగంలోను గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద తీవ్రత మరింతగా పెరిగింది. దీంతో జూరాల ప్రాజెక్టు కు సంబంధించి ముందస్తు జాగ్రత్తగా గురువారంతెల్లవారుజామున పది గేట్లు ఎత్తివేసి 44,254 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ మధ్యాహ్నం వరద తీవ్రత పెరగునున్న నేపథ్యంలో జూరాల వద్ద మరి మీ గేట్లను ఎత్తివేసే అవకాశం ఉంది. బీమాకు 1300 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ 492, నెట్టెంపాడు 1044 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!