ePaper
Thursday, June 4, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిపోచమ్మ తల్లి దీవెనలతో-గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలి

పోచమ్మ తల్లి దీవెనలతో-గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

కోట్ల వెంకటేష్ మాజీ సర్పంచ్, గట్ల ఖానాపూర్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 20 2026: పెద్దమందడి మండలం, గట్ల ఖానాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కోట్ల వెంకటేష్ ఆధ్వర్యంలో, మంగళవారం రోజు గ్రామంలో పోచమ్మ పండగ అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా పోచమ్మ తల్లికి బోనాలు ఎత్తి, భక్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కలు తీర్చుకున్నారు. తర్వాత భక్తుల ఆచారం ప్రకారం పొట్టేలును బలి ఇచ్చారు.ఈ సందర్భంగా కోట్ల వెంకటేశ్ మాట్లాడుతూ… ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్ట ఆశ్చర్యాలతో గ్రామ ప్రజలందరూ ఆనందంగా ఉండాలని, పాడిపంటలు మంచిగా పండాలని గ్రామ దేవత పోచమ్మ తల్లిని ప్రార్థించడం జరిగిందని తెలిపారు. ప్రజలు సిరి సంపదలు, పాడిపంటలతో, గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, గ్రామ పోచమ్మ తల్లి దీవెనలతో రాష్ట్రం సర్వతో- ముఖాభివృద్ధి అగ్రగామిగా నిలవాలని కోట్ల వెంకటేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కోట్ల వెంకటేష్, మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, మహిళలు, యువకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!