ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బిక్కవోలు మండల టాపర్‌గా బలభద్రపురం విద్యార్థిని బిందు మేఘన – 591 మార్కులతో అద్భుత ప్రతిభ

బిక్కవోలు మండల టాపర్‌గా బలభద్రపురం విద్యార్థిని బిందు మేఘన – 591 మార్కులతో అద్భుత ప్రతిభ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే 02:

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన ఓ ప్రతిభావంతురాలి విజయగాథ ప్రస్తుతం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామానికి చెందిన మండ వీరెడ్డి – సునీత దంపతుల కుమార్తె బిందు మేఘన, బిక్కవోలు గ్రామంలోని నేతాజీ పాఠశాలలో విద్యనభ్యసిస్తూ పదో తరగతి పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది.
తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో బిందు మేఘన 600 మార్కులకు గాను 591 మార్కులు సాధించి బిక్కవోలు మండలంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. సాధారణ కుటుంబంలో పుట్టి, కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆమె మరోసారి నిరూపించింది.
ఈ సందర్భంగా బిందు మేఘన మాట్లాడుతూ, “నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నారు. చిన్నప్పటి నుంచే వారి కష్టాలు చూసి నేను కూడా బాగా చదవాలని నిర్ణయించుకున్నాను. భవిష్యత్తులో ఉన్నత విద్యలు అభ్యసించి, చార్టర్డ్ అకౌంటెంట్ (CA) అవుతూ నా తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని ఉంది” అని తెలిపింది.
బిందు మేఘన విజయం పట్ల గ్రామస్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదరికం అడ్డంకి కాదని, పట్టుదల ఉంటే విజయమే లక్ష్యమని ఈ విద్యార్థిని నిరూపించిందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించాలని స్థానికులు కోరుతున్నారు. మొత్తం మీద బలభద్రపురం గ్రామానికి గర్వకారణంగా నిలిచిన బిందు మేఘన విజయగాథ, ఇంకా ఎంతో మందికి స్ఫూర్తినివ్వనుంది.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!