ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంముదిగొండ, మండలంలొ వినాయక చవితి ఉత్సవాలపై అవగాహన కార్యక్రమం...

ముదిగొండ, మండలంలొ వినాయక చవితి ఉత్సవాలపై అవగాహన కార్యక్రమం…

📰 Generate e-Paper Clip

డీజేలకు అనుమతి లేదు…

మండపాల నిర్వాహకులదే పూర్తి బాధ్యత..

సిఐ వడ్డేపల్లి మురళీ…

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి. రమేష్ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ముదిగొండ సిఐ వడ్డేపల్లి మురళీ ఆధ్వర్యంలో డీజే నిర్వాహకులు, గణేష్‌ మండపాల నిర్వాహకులతో గురువారం పోలీసు స్టేషన్ అవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాల ఏర్పాటు కోసం నిర్వాహకులు ముందస్తుగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా అనుమతి పొందాలని, గణేష్‌ మండపాల వద్ద నిర్వహించే కార్యక్రమాలకు నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. మండపాల వద్ద డీజేలను ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు పోలీసులకు నిర్వాహకులు పూర్తిగా సహకరించాలని సూచించారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని మురళీ కోరారు. నిబంధనలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!