ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపసింగరాయపల్లెలోప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌పై రాజకీయ రంగు పులమడం బాధాకరం...

సింగరాయపల్లెలోప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌పై రాజకీయ రంగు పులమడం బాధాకరం…

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ పిన్9 టీవీ జాతీయ దినపత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు కలసపాడు జులై 03 2026: వైయస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లో మా గ్రామమైన సింగరాయపల్లె ఎన్నో సంవత్సరాలుగా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న కారణంగా, గ్రామ ప్రజల ఆరోగ్య దృష్ట్యా, గ్రామంలో శాశ్వతమైన మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పంతో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కిరణ్ పార్టీ కార్యకర్తల దగ్గర నుండి వారితో నాలుగున్నర లక్షల రూపాయలతో వాటర్ ప్లాంట్ ను శాంక్షన్ చేపించుకొని ఎస్సీ కాలనీలో ఉచిత నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా కష్టపడి ప్రజల కోసం చేసే వారిని సమాజంలో గౌరవించాలి కానీ వారి పైన అభియోగాలు తీసుకురావద్దని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే, కొంతమంది కక్షపూరిత ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌పై రాజకీయ రంగు పులమడం బాధాకరం మా గ్రామం ఎన్నో సంవత్సరాలుగా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న గ్రామంగా ఉంది. ఫ్లోరైడ్ కారణంగా గ్రామ ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు మరియు వృద్ధులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో మేము ఈ విషయాన్ని రితీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాము. గ్రామ ప్రజల అవసరాన్ని గుర్తించిన ఆయన, పి ఎంజీకేవై పథకం క్రింద రూ.4.90 లక్షల వ్యయంతో వాటర్ ప్లాంట్‌ను మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ మా గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ప్రజాప్రయోజన కార్యక్రమం అమలులోకి రావడాన్ని కొందరు వివిధ కారణాలతో అడ్డుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ, గ్రామ యువత, గ్రామ పెద్దలు మరియు ప్రజల సహకారంతో వాటిని అధిగమించి ఈ పనిని విజయవంతంగా పూర్తి చేయగలిగాము. ఎందుకంటే ఈ వాటర్ ప్లాంట్ ఏ ఒక్కరి వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు, మొత్తం గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేయబడినది. వాటర్ ప్లాంట్ ప్రారంభించిన తర్వాత మొదటి రెండు నెలల పాటు గ్రామ ప్రజలకు పూర్తిగా ఉచితంగా నీటిని అందించాము. అనంతరం ప్లాంట్ నిర్వహణ, సిబ్బంది జీతాలు మరియు ఇతర నిర్వహణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని కేవలం రూ.5కే ఒక క్యాన్ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నాము. తరువాత వేసవి కాలంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రెండు నెలల పాటు మళ్లీ ఉచితంగా నీటిని సరఫరా చేశాము. గ్రామంలోని చివరి ప్రాంతాల్లో నివసించే వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు మరియు నడవడానికి ఇబ్బంది పడే వారి కోసం ప్రత్యేకంగా ఆటో సౌకర్యాన్ని ఏర్పాటు చేసి ఇంటి వద్దకే నీటిని అందించే విధంగా చర్యలు చేపట్టాము. ఆటో నిర్వహణ ఖర్చులు, డ్రైవర్ వేతనం, ప్లాంట్ నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నప్పటికీ, గ్రామ ప్రజలపై అదనపు భారం మోపకుండా ఇప్పటికీ కేవలం రూ.5కే ఫ్లోరైడ్ రహిత తాగునీటిని అందించడం కొనసాగిస్తున్నాము. మా లక్ష్యం లాభాపేక్ష కాదు; మా గ్రామాన్ని ఫ్లోరైడ్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే.అయితే ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రజల ఆరోగ్యం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంపై అనవసర అపోహలు మరియు నిరాధార ఆరోపణలు చేయడం విచారకరం. ప్రజల సంక్షేమం కోసం చేసిన పనిని రాజకీయ కోణంలో చూడటం కంటే, గ్రామ ప్రజలకు కలిగిన మేలు గురించి ఆలోచించడం సమాజానికి మేలు చేస్తుంది. మా వాటర్ ప్లాంట్ నిర్వహణ, ఖర్చులు, సేవలు మరియు కార్యకలాపాలకు సంబంధించి ఎటువంటి విచారణకైనా మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాము. వాస్తవాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తున్నాము. ప్రజా సేవలో పారదర్శకత, గ్రామాభివృద్ధిలో నిబద్ధత, ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యత అనే మూడు విలువలతో మేము ముందుకు సాగుతూనే ఉంటాము. ఇలా ప్రజా సమస్యల కోసం నిరంతరం పాటుపడుతుంటే పార్టీలోనే ఉండి మాలాంటి యువకులను ప్రోత్సహించ వలసిన వారు రాజకీయ భ్రత చల్లుతూ మమ్మల్ని పైకి రానీయకుండా చేయాలని కొంతమంది కంకణం కట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పుడైనా మంచి పనులను దృష్టిలో ఉంచుకొని తాలూకా స్థాయిలో నియోజకవర్గ ఇన్చార్జీలతో మా గ్రామ ఫ్లోరైడ్ విషయాన్ని మాట్లాడి ముఖ్యంగా చిన్నారులు మరియు వృద్ధులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో మేము ఈ విషయాన్ని గౌరవనీయులైన రితీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాము. గ్రామ ప్రజల అవసరాన్ని గుర్తించిన ఆయన, పి ఎంజీకేవై పథకం క్రింద రూ.4.90 లక్షల వ్యయంతో వాటర్ ప్లాంట్‌ను మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ మా గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ప్రజాప్రయోజన కార్యక్రమం అమలులోకి రావడాన్ని కొందరు వివిధ కారణాలతో అడ్డుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ, గ్రామ యువత, గ్రామ పెద్దలు మరియు ప్రజల సహకారంతో వాటిని అధిగమించి ఈ పనిని విజయవంతంగా పూర్తి చేయగలిగాము. ఎందుకంటే ఈ వాటర్ ప్లాంట్ ఏ ఒక్కరి వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు, మొత్తం గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేయబడినది. వాటర్ ప్లాంట్ ప్రారంభించిన తర్వాత మొదటి రెండు నెలల పాటు గ్రామ ప్రజలకు పూర్తిగా ఉచితంగా నీటిని అందించాము. అనంతరం ప్లాంట్ నిర్వహణ, సిబ్బంది జీతాలు మరియు ఇతర నిర్వహణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని కేవలం రూ.5కే ఒక క్యాన్ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నాము. తరువాత వేసవి కాలంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రెండు నెలల పాటు మళ్లీ ఉచితంగా నీటిని సరఫరా చేశాము. గ్రామంలోని చివరి ప్రాంతాల్లో నివసించే వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు మరియు నడవడానికి ఇబ్బంది పడే వారి కోసం ప్రత్యేకంగా ఆటో సౌకర్యాన్ని ఏర్పాటు చేసి ఇంటి వద్దకే నీటిని అందించే విధంగా చర్యలు చేపట్టాము. ఆటో నిర్వహణ ఖర్చులు, డ్రైవర్ వేతనం, ప్లాంట్ నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నప్పటికీ, గ్రామ ప్రజలపై అదనపు భారం మోపకుండా ఇప్పటికీ కేవలం రూ.5కే ఫ్లోరైడ్ రహిత తాగునీటిని అందించడం కొనసాగిస్తున్నాము. మా లక్ష్యం లాభాపేక్ష కాదు; మా గ్రామాన్ని ఫ్లోరైడ్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే. అయితే ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రజల ఆరోగ్యం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంపై అనవసర అపోహలు మరియు నిరాధార ఆరోపణలు చేయడం విచారకరం. ప్రజల సంక్షేమం కోసం చేసిన పనిని రాజకీయ కోణంలో చూడటం కంటే, గ్రామ ప్రజలకు కలిగిన మేలు గురించి ఆలోచించడం సమాజానికి మేలు చేస్తుంది. మా వాటర్ ప్లాంట్ నిర్వహణ, ఖర్చులు, సేవలు మరియు కార్యకలాపాలకు సంబంధించి ఎటువంటి విచారణకైనా మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాము. వాస్తవాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తున్నాము. ప్రజా సేవలో పారదర్శకత, గ్రామాభివృద్ధిలో నిబద్ధత, ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యత అనే మూడు విలువలతో మేము ముందుకు సాగుతూనే ఉంటాము.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!