ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హైకోర్టు కఠిన వైఖరి – విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో వివరాలు ఇవ్వాలంటూ ఆదేశం

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక తెలంగాణ స్టేట్ డెస్క్: ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తెలంగాణ హైకోర్టు మరోసారి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేసుకోవచ్చని కాలేజీ యాజమాన్యాలకు గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా జీవో 7 అమలులో ఉందని పేర్కొంటూ, ఇటీవల ఆ జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో, జీవో 7పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టును కోరగా, దానిపై హైకోర్టు స్పష్టంగా స్పందించింది. ముందుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విద్యార్థుల వ్యక్తిగత ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారో వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసే ప్రక్రియను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపినప్పటికీ, ఖచ్చితమైన టైమ్‌లైన్‌పై స్పష్టత ఇవ్వాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను జూన్ 24వ తేదీకి వాయిదా వేస్తూ, అప్పటిలోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామం నేపథ్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది.

Latest Articles

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి 

–పోలీసు సిబ్బంది ఐకమత్యం, సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు...

రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా ఖో -ఖో పోటీలకు రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థి ఎంపిక

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9...

వినాయక నవరాత్రిఉత్సవాల్లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో  అన్నదాన కార్యక్రమo

 – పోలీసు సిబ్బంది ఐకమత్యం, సమన్వయంతో విధులు నిర్వహిస్తూ...

జన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు

 🌹✨ జగ్గయ్యపేట రాజకీయ ప్రస్థానంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న...

మోజర్లలో శ్రీ రామలింగేశ్వర దేవస్థానం వద్ద ఘనంగా గణపతి ఉత్సవాలు

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ...

విజయవాడ క్లస్టర్ 5 YSRCP విశృత స్థాయి సమావేశం

విజయవాడ పశ్చిమలో వైయస్ఆర్ సీపీ క్లస్టర్-5 విస్తృత స్థాయి సమావేశం...సమావేశంలో...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం...
error: Content is protected !!