ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

మోజర్ల గ్రామంలో దొంగతనం కలకాలం

ఇంటి తలుపులు తెరచి వెండి గొలుసులు, నగదు అపహరణ

 

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 11 2026: పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామంలో దొంగతనం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కానాయపల్లి రామచంద్రయ్య తండ్రి కుర్మయ్య వృత్తి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తూ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అయితే ప్రతి వారం స్వగ్రామానికి వచ్చి వ్యవసాయ పనులు, ఇంటి పనులు, చూసుకోవడంతో పాటు తన తల్లి అంజమ్మ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి తిరిగి వెళ్తుంటారు. ఈ నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి కొత్తకోటలో ఉన్న తన కుమార్తె ఇంటికి వెళ్లినట్లు సమాచారం. మరుసటి రోజు సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఫిర్యాదుదారుడి చెల్లెలు అటువైపు వెళ్తూ ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించింది. అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా బెడ్‌రూమ్‌లోని బీరువా తెరిచి ఉండటం కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని అన్నయ్య అయినటువంటి కానాయపల్లి రామచంద్రయ్యకు తెలియజేయగా ఆయన అక్కడికి చేరుకుని పరిశీలించారు. అక్కడే చెట్టు ప్రక్కన ఉన్న తాళం తీసుకొని తలుపులు తెరిచి బీరువాలో ఉన్న సుమారు 15 తులాల వెండి గొలుసులు, మరికొంత నగదు కనిపించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు అనుమానం వచ్చి ఈ ఘటనపై స్థానిక పెద్దమందడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ శ్రీనివాస్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!