ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

గౌరవపూర్వక కలయిక..

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఢిల్లీ ప్రతినిధి ప్రత్యేక కథనం

డిల్లీలో భారత సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి ని వారి నివాసంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధినేత ‘ పద్మశ్రీ ‘ మంద కృష్ణ మాదిగ గౌరవ పూర్వకంగా కలవడం జరిగింది.

వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

గతంలో సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారి మీద జరిగిన దాడిని నిరసిస్తూ క్షేత్రస్థాయి నుండి డిల్లీ స్థాయి వరకు వివిధ దశల్లో ఎమ్మార్పీఎస్ ఉద్యమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందుకు సంబంధించిన ప్రత్యేక నివేదికను గవాయి కి అందజేయడం జరిగింది.

 

చీఫ్ జస్టిస్ గా సుప్రీం కోర్టులో బెంచ్ మీద వాదనలు వింటున్న బిఆర్ గవాయి మీద ఒక అగంతకుడు బూటు విసిరి దాడికి పాల్పడడం జరిగింది.

 

దళిత సామాజిక వర్గానికి చెందిన జస్టిస్ బిఆర్ గవాయి గ మీద జరిగిన దాడిని నిరసిస్తూ ‘ పద్మశ్రీ ‘ మంద కృష్ణ మాదిగ జాతీయ స్థాయిలో దళిత ఆత్మగౌరవ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది.

 

ఆ పోరాటంలో భాగంగా తహశీల్దార్ కార్యాలయల ముందు ఆందోళనలు, కలెక్టర్ల ముట్టడి , అలాగే వేలాది మందితో హైదరాబాద్ లో దళిత ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఆ తరువాత నవంబర్ 17 న డిల్లీలో పెద్ద ఎత్తున దళిత ఆత్మగౌరవ ప్రదర్శన చేపట్టడం జరిగింది.జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున మహాధర్నాను నిర్వహించడం జరిగింది.

జాతీయ స్థాయిలో జరిగిన ఈ దళిత ఆత్మగౌరవ ఉద్యమ ఘట్టాలను ప్రత్యేక డాక్యూమెంట్ గా రూపొందించడం జరిగింది.

ఆ నివేదికను మంద కృష్ణ మాదిగ బిఆర్ గవాయి కి అందించడం జరిగింది.

ఈ సందర్భంగా వివిధ సామాజిక అంశాల మీద వారు చర్చించుకోవడం జరిగింది.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి -( యం ఆర్ పి ఎస్)

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!