ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

కబ్జా చేసిన వారి నుండి మా భూమిని కాపాడండి

📰 Generate e-Paper Clip


– తహసీల్దార్ కు వినతిపత్రంఅందజేసి బోరున విలపించిన గిరిజనులు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 22.2026.
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటేల్లి గ్రామ శివారులో గల సర్వే నంబర్ 196, 197 లో నాటేల్లి తండాకు చెందిన పట్టాదారులు నారమ్మ, మంగ్యా నాయక్, నార్య నాయక్, బాలు నాయక్, సెన్యా నాయక్ లు కలిసి మా భూమిని హైదరాబాద్ కు చెందిన ఉన్నత ఉద్యోగి రాములు అనే వ్యక్తి కబ్జా చేశారని సోమవారం తహసీల్దార్ సుభాష్ నాయుడు కు వినతిపత్రం అందజేశారు. కబ్జా చేసిన వ్యక్తికీ 196 సర్వే నంబర్ లో రికార్డుల పరంగా 4ఎకరాల 22 గుంటల భూమి ఉంది. కానీ అదనంగా ఇప్పుడు ఆయనకు 7 ఎకరాల భూమి ఉందని చెప్పారు. అయన భూమి ఆయనకు పోను మిగులు భూమి మాదేనని మాకు తెలియకుండా అయన బలాన్ని ప్రదర్శించి మా భూమిని కబ్జా చేశారని తెలిపారు. అయన ఉన్నత ఉద్యోగి కాబట్టి అడగడానికి వెళ్తే మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తూ మాకు అన్యాయం చేస్తున్నారని తహసీల్దార్ ముందు తమ గోడును వెళ్ళబుచ్చారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని మా భూమిని అడగడానికి వెళ్తే మాపై దాడులు జరుపుతున్నారని తెలిపారు. ఇటీవల కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్నీ తీసుకెళ్లామని గుర్తు చేశారు. నాటేల్లిలో ఉన్న ఒకరిద్దరు రాములు అనే వ్యక్తికీ పరోక్ష సహకారం అందిస్తున్నారని ఎక్కడికి వెళ్లిన మాకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం, ఆర్థిక బలం అడ్డుపెట్టుకొని మా భూమిని దొంగ డాక్యుమెంట్ల సాయంతో రిజిస్టర్ చేసుకున్నాడని చెప్పారు. మీరు మొఖపైకి వచ్చి 196, 197 సర్వే నంబర్లు పూర్తిగా సర్వే చేసి రికార్డ్ పరంగా ఎవరి భూములు ఎంత ఉన్నాయో పరిశీలించి న్యాయపరమైన నిర్ణయం తీసుకోని మాకు న్యాయం చెయాలనీ తహసీల్దార్ ను వారు కోరారు.

Latest Articles

సత్యనారాయణ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించిన కాకాని

పొలిటికల్ పవర్  సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ...

దళితుల అంటే దాడి చేసే వాళ్ళు కాదు

పొలిటికల్ పవర్ ప్రతినిధి  తెలంగాణవాళ్లు కాంగ్రెస్ పార్టీ తొత్తులు, కట్టు బానిసలు...

 ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలనే సంకల్పంతో కిలో బియ్యం...

పోక్సో కేసులో 20 సంవత్సరాలు కఠిన కారాగారా శిక్ష

⚖️ పోక్సో కేసులో ఒకరికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షపొలిటికల్...

Related Articles

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...
error: Content is protected !!