– అధికార పార్టీ నాయకుల అభివృద్ధి మాటలు కేవలం పేపర్లకు, సోషల్ మీడియాకే పరిమితం మయినవి తప్ప ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు,
– ప్రభుత్వ బాలికల పాఠశాలలో వంటగదిలేక గత అనేక సంవత్సరాలుగా ఆడవారు ఎండలో వంటలు చేస్తున్నారు,
– బిజెపి మహబూబ్ నగర్ జిల్లాఉపాధ్యక్షులు కొమ్ము భరత్ భూషణ్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 02.2026.
కొత్తకోటమున్సిపల్,నందుఅధికారపార్టీనాయకుల అభివృద్ధి మాటలు కేవలం పేపర్లకు, సోషల్ మీడియాకే పరిమితం మయినవి తప్ప ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదని,బిజెపి మహబూబ్ నగర్ జిల్లాఉపాధ్యక్షులు కొమ్ము భరత్ భూషణ్
అన్నారు. ఈసందర్భంగా బిజెపి మహబూబ్ నగర్ జిల్లాఉపాధ్యక్షులు కొమ్ము భరత్ భూషణ్,మాట్లాడుతూరాష్ట్రంలోకాంగ్రెస్,పార్టీఅధికారంలోకివచ్చి31నెలలుఅవుతుందని, దేవరకద్ర శాసనసభ్యులు తన అభివృద్ధి నిధుల నుండి కొత్తకోట పట్టణానికి ఒక్క రూపాయి విడుదల చేసింది లేదని అన్నారు. ప్రభుత్వబాలురఉన్నతపాఠశాలలోవంటగది లేకఆరుబయట,ఎండలోవంటలువండుచున్నారని,ప్రభుత్వబాలికలపాఠశాలలోవంటగదిలేకగతఅనేకసంవత్సరాలుగాఆడవారుఎండలోవంటలుచేస్తున్నారనిఅన్నారు.మదనాపురం నుండి కొత్తకోటకు వచ్చే ప్రధాన రహదారి, బైపాస్ బ్రిడ్జి కింద మురుగు నీరుఏరులైపారుతున్నా,Lఅదేదారిలోతరచూ,కార్లలోప్రయాణిస్తున్నశాసనసభ్యునికిఅతనికీర్తనాకారులకుఇదికనిపిస్తున్నా,మూగసాక్షులుగాఉంటున్నారు. 2023 లో కేంద్ర ప్రభుత్వం పట్టణ మంచినీటి సౌకర్యం కొరకు 15 కోట్లు వెచ్చించినా, పట్టణ భాజపా పలుసార్లు ఆందోళనలు చేసినా,ఆ పనులకు మోక్షం లేదని, పట్టణానికి మంజూరి అయిన ఇందిరమ్మ ఇండ్లలో, సగం మందికి కూడా బిల్లులు రాలేదు. కేంద్రం ఇచ్చే రెండు లక్షల రూపాయలతోనే లబ్ధిదారులందరికీ సర్దుతున్న వైనం అన్నారు.మంజూరి అయిన 30 పడకల ఆసుపత్రిని,50 పడకల ఆసుపత్రిగామారుస్తానుఅనిచెప్పినమాటలు నీటి మీద రాతలుగానేఉన్నయని,పట్టణంలో గతంలో అధికారాన్ని అనుభవించిన బి.ఆర్.ఎస్.,కాంగ్రెస్ పార్టీలు రెండు ఏకమై మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని గెలువనివ్వ లేదు. అందుకే వారి అరాచకాలను బిఆర్ఎస్ ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు.

