
– బిజెపి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా
ఉపాధ్యక్షులు కొమ్ము భరత్ భూషణ్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 01.2026.
దేశంలో గత కొంతకాలంగా విభజన వాదుల, ఆటంకవాదుల చర్యలను గమనిస్తుంటే బాధగా ఉందని, వీరికి తోడు ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభం అయిన పత్రిక, ప్రచార రంగంలోని కొన్ని సంస్థలు కూడా విచ్ఛిన్నకారులకు బలం చేకూరే విధంగా వస్తున్న వ్యాసాలు, ప్రచారాలు చూస్తుంటే మనసు కలత చెందుతుందని బిజెపి పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము భరత్ భూషణ్ శుక్రవారం ఒక ప్రకటన లో ఆవేదన వ్యక్తంచేశారు.ఈసందర్భంగాఆయనమా ట్లాడుతూ
భారతీయ జనతా పార్టీ మీద వీరికి ఎందుకంత వ్యతిరేక భావము అర్థం కావడం లేదని, 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అనేక అవినీతి, కుంభకోణాలు రాజ్యమేలాయని, 60సంవత్సరాల్లో జరిగినఅభివృద్ధికిరెట్టింపుగాకవలం12సంవత్సరాల లోనే మోడీ ప్రభుత్వం చేసి చూపించిందని అన్నారు. అది కండ్ల ముందు లెక్కలతో సహా చూపించే విధంగా ఉందని, 12 సంవత్సరాల్లో ఏ ఒక్క చిన్న అవినీతికి కూడా ఆస్కారం లేదని,మోడీ హయాంలో అభివృద్ధి చెందిన భారత్ ను మరలా అదో:పాతాళానికి లాగేయాలని ఒకవైపు అమెరికా, చైనా దేశాలు కాచుకొని ఉన్నవి, ప్రభుత్వ అధికారుల అవినీతి కారణంగా నీట్ పేపర్ లీక్ అయింది.ఇదిసహించరాని నేరం. గతంలో కూడా ఇలాంటి పొరపాట్లు అనేకసార్లు జరిగాయి. దేశవ్యాప్తంగా ఈసారి దీనిపై జరిగిన ఆందోళన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఢిల్లీ జంతర్ మంతర్ లో అంత పెద్ద ఎత్తున ఆందోళన చేసే శక్తి ఉంటుందాని, వీరు వెనుక కచ్చితంగా దేశ వ్యతిరేకుల కుట్రలు దాగి ఉన్నయని అన్నారు.ఈ పార్లమెంటు సమావేశాల్లో మహిళలకు 33 శాతం బిల్లు, డిలీమిటేషన్ బిల్లు మరియు FCRA (Fareign contribution Regulation Act) బిల్లులు అమలు అయితే ఇక మాకు దేశంలో పుట్టగతులు ఉండవని గట్టిగా నమ్మిన కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఆప్ పార్టీలు మరియు దేశ విద్రోహ శక్తులు ఏకమై పార్లమెంటులో బయట ముప్పేట దాడులకు దిగుచున్నారు. ఈ పరిస్థితులను మనం క్షుణ్ణంగా గమనించాలని అన్నారు.మన కర్తవ్యంతాడుబొంగరంలేనికాక్రోచ్,జనతాపార్టీదేశంలోకొంతమందిఅమాయకపుయువతను,అసాంఘిక శక్తులనుఏకంచేసిఆందోళనచేయగలిగినప్పుడుమనమెందుకువారిమాదిరిగాఉద్యమిం చకూడదని అనే ఆలోచనకు రావాలని, కాంగ్రెస్,కమ్యూనిస్టుల ఆప్ లాంటిపార్టీలఅవినీతి,అక్రమపరిపాలననుప్రజలకు,ముఖ్యంగాయువతకుతెలియజసేటందుకునడుంబిగించాలి.ఇదిఎక్కడికక్కడజరగాలనిఅన్నారు.ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నెరవేర్చని హామీలమీదఉద్యమించడానికిసిద్ధంకావాలని,మనకేంఅవుతుందిలే,అనిమౌనంగాకూర్చుంటేపెనుప్రమాదంసంభవిస్తుదనిఅన్నారు.నిశ్శబ్దంఅన్యాయానికి బలం ఇస్తుందని, జరుగుతున్న అభివృద్ధిని ప్రశంసించని గుడ్డి సమాజం పెట్రేగుతుంటే మనది మనం అరబ్బా టంగా చెప్పుకోవడంలో తప్పు లేదని ఆయన అన్నారు.
