ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఆటో ఢీకొని రిటైర్డ్ ఎంఈఓకు తీవ్ర గాయాలు.. కేసు నమోదు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 11 2026: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని జంగమయ్యపల్లి – పామిరెడ్డిపల్లి టర్నింగ్ వద్ద ఆదివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖిల్లాఘనపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంఈఓ కొండారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌పై వెళ్తున్న సమయంలో అతివేగంగా వచ్చిన ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన కొండారెడ్డిని వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని యశోద ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై గాయపడిన కొండారెడ్డి సోదరుడు కసిరెడ్డి మన్యపు రెడ్డి ఫిర్యాదు మేరకు సోమవారం పెద్దమందడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాస్ శర్మ తెలిపారు. అతివేగంగా, అజాగ్రత్తగా ఆటో నడిపిన వెంకటాంపల్లి గ్రామానికి చెందిన కావలి శ్రీనివాసులుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!