ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

బిక్కవోలులో రూ.1.10 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం

📰 Generate e-Paper Clip

 

పాల్గొన్న ఎంపి పురంధేశ్వరి

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే 23:


తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని బిక్కవోలులో రూ.1 కోటి 10 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రూ.63.50 లక్షలతో నిర్మించిన బిక్కవోలు మెయిన్ రోడ్ నుంచి స్మశానవాటికకు వెళ్లే సీసీ రోడ్డును ప్రారంభించారు. అలాగే దాతల సహకారంతో రూ.47 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన స్మశానవాటిక, చెత్త శుభ్రపరిచే సదుపాయాలు, స్నాన ఘట్టాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
స్మశానవాటిక అభివృద్ధికి సహకరించిన దాతలను, శ్రమదానం చేసిన ట్రాక్టర్ యజమానులను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, బిక్కవోలు మండల నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

Related Articles

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు సెప్టెంబర్ 17. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు...

సమగ్ర నివేదికతో మండల సర్వసభ్య సమావేశం కి హాజరవ్వాలి ఎంపీపీ చల్లా గంగాదేవి వెంకటనారాయణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్వైయస్సార్ కడప జిల్లా వేముల మండలంలో నేడు జరిగే మండల సర్వసభ్య...

వేముల వెంకట్రావును పరామర్శించిన చేతివృత్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్

విజయవాడ (చిట్టినగర్): పొలిటికల్ పవర్ ప్రతినిధివిజయవాడ చిట్టినగర్ నివాసి, బీసీ నాయకులు మరియు అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు అయిన వేముల వెంకట్రావు గారు ఇటీవల మోకాళ్ల ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ...
error: Content is protected !!