*పత్రికల్లో కథనాలు వచ్చిన స్పందించని అధికారులు*
*ములకలపల్లి చేరుకున్న భారీ ఇనుము ఎక్కడిది ఎవరిది ఎఈ నుండి సిఇ వరకు వాటాలు!*
*ప్రభుత్వ అధికారుల గుత్తేదారుల వాటా ఎంత?*
*ఇనుమును దొంగతనం చేసినవారిపై కేసు ఎందుకు పెట్టలేదు*
*నాణ్యత లేక కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం*
*ఫిర్యాదు లేకుండా పోలీసులు విచారణ చేసారా ?*
*అశ్వారావుపేట పొలిటికల్ పవర్ న్యూస్ (ఆర్సి కారం వెంకటేష్ ) జులై 11:* ములకలపల్లి మండలం కమలాపురం గ్రామపంచాయతీ శివారులో సీతారామ ప్రాజెక్ట్ పంపు హౌస్ టూ వద్ద జరుగుతున్న కాంక్రీట్ పనుల్లో అవినీతి పెరిగిపోయింది విచ్చలవిడిగా ప్రభుత్వ పనుల నాణ్యత కు తిలోదకాలిస్తూ గుత్తేదారు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు బాహాటంగా గత రెండు రోజులు క్రితం ఓ ప్రధాన పత్రికలో వచ్చినటువంటి కథనంపై కనీస స్పందించని ఇరిగేషన్ అధికారులు ఏ ఫిర్యాదు అందలేదంటూ ములకలపల్లి మండల కేంద్రంలో ఉన్న ఓ ప్రాంతంలో పోలీసుల సంచారం పలు అనుమానాలకు తావిస్తోంది తిరిగి మరుసటి రోజున పత్రికా కథనాల ప్రకారం ఇనుము చేరిందని తెలిపారు కానీ అసలు పనులకు వాడాల్సిన ఇనుము గ్రామాల్లోకి ఎందుకు వచ్చింది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ నాసిరకం పనులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు అదేవిధంగా ప్రజాధనం దుర్వినియోగం జరుగుతున్న సంబంధిత అధికారులు స్పందించకపోవడం శోచనీయం ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై తగు చర్యలు తీసుకోకపోతే కొంతమంది సామాజిక కార్యకర్తలు విషయం ఆ శాఖ మంత్రికి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు వినికిడి ఏది ఏమైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టులు లో జరుగుతున్న అవినీతిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులపై గుత్తే దారులపై చర్య తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు
