– 54వ వార్షికోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 30.2026.
శ్రీ కాశీ విశ్వేశ్వర బాల బ్రహ్మేంద్ర స్వాముల వారి 54వ వార్షిక గురు పూజోత్సవం బుధవారం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.ఈఆధ్యాత్మికమహోత్సవంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, పలువురు వార్డు కౌన్సిలర్లు స్థానిక నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.రెండు రోజుల నుంచి ఆలయంలో స్వామివారికి, గంగాదేవికి విశేషఅభిషేకాలు,అలంకరణలు, మంగళ హారతులు ఘనంగానిర్వహించారు. అనంతరం గురు పూజ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.54 ఏళ్లుగా ఈ గురు పూజోత్సవాన్ని ఎంతో నిష్ఠతో, విజయవంతంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీసభ్యులను,భక్తులనుఅభినందించారు.ఈకార్యక్రమంలోస్థానికకౌన్సిలర్లు,ప్రజాప్రతినిధులు, వివిధ వార్డుల నాయకులు, ఆలయకమిటీనిర్వాహకులు.ఈకార్యక్రమంలో కౌన్సిలర్లు తాటికొండ కృష్ణ, శివ సాయి, పర్వీన్ షకీల్, జమ్ములమ్మ , వెంకటేష్ సాగర్ , మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, బురమోని రాముల యాదవ్, మార్కెట్ డైరెక్టర్ రామన్ గౌడ్, మోతే రాములు, రణధీర్ రెడ్డి, వినయ్ కుమార్, సునీల్ రెడ్డి, చెనివిళ్ళ శివ, మిర్చి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

