పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జూన్ 15 2026: తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన కార్యక్రమం సేవా భావానికి నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి కిలారు అనిల్ కుమార్ స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. పేద ప్రజలకు అవసరమైన సమయంలో రక్తం అందించి వారి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం అత్యంత విలువైన సేవ అని వారు పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక బాధ్యతను ప్రతిబింబిస్తుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించారు. “రక్తదానం – మహాదానం, ఒకరి రక్తం మరొకరి ప్రాణాన్ని కాపాడగలదు” అనే సందేశంతో పలువురు యువకులు కూడా రక్తదానానికి ముందుకు వచ్చారు. పేద ప్రజల ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది.
